News January 31, 2025

న్యాయవాదులకు విశాఖ జిల్లా న్యాయమూర్తి సూచన

image

న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్టులో కొత్తగా దాఖలయ్యే దావాలు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారానికి ముందు మధ్యవర్తిత్వానికి పంపిస్తామన్నారు. మధ్యవర్తత్వంలో మెళుకువలను ఆయన వివరించారు. శిక్షకులు సత్యారావు, రత్నతార, జిల్లా న్యాయ సేవాధివార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ ఉన్నారు.

Similar News

News February 16, 2025

పెందుర్తి: వరుసకు బాబాయ్.. అయినా పాడుబుద్ధి..!

image

వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెబ్బిలి రవికుమార్‌పై ఫిర్యాదు చేసింది. వెంటనే అతను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల పెందుర్తి పోలీసులు రిట్ పిటిషన్ వెయ్యగా బెయిల్‌ రద్దవ్వడంతో అతనిని శనివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ సాయి పృథ్వీ తేజ తెలిపారు. రవికుమార్ ప్రస్తుతం ఏపీ బీసీ సమైక్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. 

News February 16, 2025

మహిళను బెదిరించిన వ్యక్తి అరెస్ట్: సైబర్ క్రైమ్ పోలీసులు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని శనివారం రిమాండ్‌కు పంపించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఫేక్ ఇన్‌స్టా ద్వారా తన ఫేస్‌తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోస్ వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే ఫొటోస్ ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

News February 16, 2025

డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారికి ఫైన్ వేయండి: కలెక్టర్

image

విశాఖ నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారిని గమనించి అపరాద రుసుములను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!