News November 19, 2024
న్యూయార్క్ UNGA సమావేశాల్లో ఎంపీ బైరెడ్డి శబరి

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తదితరులతో కలిసి ఆమె UNGA సమావేశాలకు హాజరయ్యారు. ఈ అసెంబ్లీ సెషన్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని శబరి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పాల్గొన్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశారు. 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయి.
Similar News
News December 7, 2025
నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్కుమార్(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
కర్నూలు: ‘స్క్రబ్ టైఫస్.. వ్యాధి కాదు’

స్క్రబ్ టైఫస్ వ్యాధి కాదని, మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై వైద్య బృందంతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని, 39 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు వివరించారు.
News December 7, 2025
ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.


