News December 31, 2024
న్యూ ఇయర్లో న్యూసెన్స్ చేస్తే కేసులు: సీపీ సునీల్ దత్
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లు, లకారం ట్యాంక్బండ్, వెలుగుమట్ల పార్కు, తదితర పబ్లిక్ పార్కుల్లో పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. DEC 31 అర్ధరాత్రి ఒంటిగంటకు ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తే, వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేస్తామని హెచ్చరించారు.
Similar News
News January 25, 2025
KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్
మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2025
KMM: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: అడిషనల్ డీసీపీ
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.
News January 24, 2025
చాపరాలపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
ములకలపల్లి మండలం చాపరాలపల్లి గుట్టగూడెం సమీపంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు రూ.6000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో SI కిన్నెర రాజశేఖర్తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.