News February 19, 2025

పంగులూరు వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి

image

బాపట్ల జిల్లా పంగులూరు మండలం కొప్పెరపాడు శివారులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్ పైనుంచి కిందపడినట్లు సమాచారం. గమనించిన స్థానికులు అతణ్ని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

తానా బాల సాహిత్య భేరి-2025కు ఖమ్మం విద్యార్థిని ఎంపిక

image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నవంబర్ 30న ఆన్‌లైన్‌లో నిర్వహించే అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనానికి ఖమ్మం, ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కొల్లి చంద్రిక ఎంపికైంది. కథ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 101 మంది బాల రచయితలతోపాటు చంద్రిక పాల్గొంటుంది. ఈ అరుదైన అవకాశం లభించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

News November 28, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇ- మెయిల్ ద్వారా careers@bobcaps.inకు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News November 28, 2025

ఈ పురుగు యమ డేంజర్.. కుడితే అంతే..

image

AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్‌లెట్స్ పడిపోవడం, మెదడు, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్ సోకుతాయి.