News February 19, 2025
పంగులూరు వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి

బాపట్ల జిల్లా పంగులూరు మండలం కొప్పెరపాడు శివారులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్ పైనుంచి కిందపడినట్లు సమాచారం. గమనించిన స్థానికులు అతణ్ని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

విజయవాడ RTC జోనల్లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చి పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.
News November 11, 2025
ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఉండవల్లికి బయలుదేరారు.
News November 11, 2025
భవిష్యత్తు బంగారం ‘రాగి’: అనలిస్టులు

ఈవీలు, సోలార్ ప్యానెల్స్, 5G టవర్లు, డేటా సెంటర్ల నిర్మాణంలో ఉపయోగించే రాగి విలువ పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు. ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఇండోనేషియాలోని కాపర్ మైన్స్ వరదలు, ప్రమాదాలతో షట్డౌన్ అంచున ఉన్నాయి. 2026కు 6 లక్షల టన్నుల రాగి కొరత ఏర్పడవచ్చు. కొత్త మైన్స్ తెరిచేందుకు 10-15 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో టన్ను రాగి 11-14 వేల డాలర్లకు చేరుకోవచ్చని చెబుతున్నారు.


