News November 27, 2024

పంచగ్రామాల సమస్య.. అశోక్‌తో విశాఖ ఎమ్మెల్యేలు భేటీ

image

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్ తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News April 5, 2026

VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

image

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్‌పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2026

ఉమ్మడి జిల్లాలో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేడు పర్యటన

image

రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి పార్వతీపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరనున్నారని జిల్లా సమాచార శాఖ శనివారం తెలిపింది.

News April 5, 2026

ఉమ్మడి జిల్లాలో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేడు పర్యటన

image

రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి పార్వతీపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరనున్నారని జిల్లా సమాచార శాఖ శనివారం తెలిపింది.