News March 30, 2025

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే

image

మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.  

Similar News

News February 25, 2026

VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

image

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి‌కి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 25, 2026

UPDATE: నంద్యాల జిల్లాలో మిద్దె కూలి వృద్ధురాలి మృతి

image

మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జిలానీ బాషా ఓ మట్టి మిద్దెలో పిండి గిర్ని నడుపుతున్నాడు. లక్ష్మీదేవమ్మ, కురువ సాలమ్మ, మరో ఇద్దరు మహిళలు జొన్నలు పిండి గిర్నిలో వేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. పిండి గిర్ని ఆడుతుండగా కొంత మట్టి మిద్దె పైకప్పు కూలి వృద్ధురాలు మరణించారు. మరో మహిళకు గాయాలయ్యాయి.

News February 25, 2026

భారీగా పెరిగిన ‘బంగినపల్లి’ ధర

image

AP: ఈ ఏడాది మామిడి రైతులకు అదృష్టం వరించింది. కవర్లు తొడిగిన <<19097565>>బంగినపల్లి<<>> మామిడి టన్ను రేటు ₹1.80 లక్షలు, తోతాపురి ₹లక్ష పైనే పలుకుతున్నాయి. ప్రభుత్వం కవర్లకు 50% రాయితీ ఇస్తుండటంతో ఎక్కువ మంది రైతులు వాడేందుకు ముందుకొస్తున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత రెట్టింపు అయ్యిందని, తెగుళ్లు, పక్షులు, జంతువుల నుంచి రక్షణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 10L ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.