News March 30, 2025
పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే

మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 9, 2025
పార్వతీపురం: జేసీ నాయకత్వంలో రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం

రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు శత శాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇది రెవెన్యూ క్లినిక్ అతిపెద్ద విజయమని, ఎవరికైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: ప్రతినిధులకు రిటర్న్ గిఫ్టులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరైన ప్రతినిధులకు రాష్ట్ర వైభవాన్ని చాటే ప్రత్యేక సావనీర్లు(గిఫ్ట్స్) అందించారు. వీటిలో సంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ చీర, ముత్యాల నగరానికి ప్రతీకగా ముత్యాల చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ కళాకారులు చేతితో చేసిన లక్క గాజులు, సుగంధ సంప్రదాయాన్ని తెలిపే హైదరాబాద్ అత్తర్, రాష్ట్ర వారసత్వ సంస్కృతిని తెలిపే చేర్యాల పెయింటింగ్ చెక్క బొమ్మలు ఉంచారు.
News December 9, 2025
నల్గొండ: పీజీ విద్యార్థులకు గమనిక

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ (M.A/M.Com/M.Sc/M.S.W) సెమిస్టర్-3 పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 15వ తారీకు, అపరాధ రుసుముతో ఈనెల 17వ తారీకు వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


