News February 13, 2025
పంచాయతీ ఎన్నికలను సన్నద్ధం కావాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్ 1, స్టేజ్ స్టేజ్2 నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు.
Similar News
News March 28, 2025
సోంపేట : మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం

సోంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ సుంగారపు ప్రసాద్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 28, 2025
SRPT: బకాయిదారుడి ఇంటి ముందు బైఠాయించిన అధికారులు

ఇంటి పన్ను చెల్లించడం లేదని మున్సిపల్ అధికారులు, సిబ్బంది బకాయిదారుడి ఇంటి ముందు బైఠాయించి వినూత్న నిరసన తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో గురువారం జరిగింది. స్థానిక శిశు మందిర్ స్కూల్ కాలనీకి చెందిన బానోత్ భీమ ఇంటి పన్ను చెల్లించకపోవడంతో పలుమార్లు నోటీసులు పంపించారు. అయినా పన్ను చెల్లించకపోవడంతో ఇలా బకాయిదారుడి ఇంటి ముందు కూర్చొని అధికారులు నిరసన తెలిపారు.
News March 28, 2025
పెనగలూరు: అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు

పెనగలూరు మండలం, ఓబిలి గ్రామానికి చెందిన బుర్రకట్ల మహేశ్వరయ్యను ఇనుప రాడ్డుతో తలపై మోది చంపిన తమ్ముడు బుర్రకట్ల ఈశ్వరయ్య చంపాడు. ఈకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జి గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరం జనవరి నెలలో నేరం చేసిన ముద్దాయికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయింది. కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.