News February 14, 2025
పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ, RO, AROల విధులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
Similar News
News October 20, 2025
కావలి: మాలేపాటి సుబ్బానాయుడు మృతి

ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందారు. బ్రెయిన్ స్టోక్తో గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాలేపాటి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి మాలేపాటి అన్న కుమారుడు బాను గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతక్రియలు ఇవాళ దగదర్తిలో నిర్వహించనున్నారు. మాలేపాటి మరణ వార్తతో ఆ కుటుంబం శోకసముద్రం మునిగిపోయింది.
News October 20, 2025
కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలగాలి: KMR కలెక్టర్

దీపావళి పండుగను పురస్కరించుకొని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలన్నారు.
News October 20, 2025
ప్రజలకు జిల్లా కలెక్టర్ DIWALI WISHES

జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి దీపం ప్రతిఒక్కరి జీవితాల్లో విజయాల కాంతిని నింపాలి. ఈ దీపావళి పండుగలో దీపాల వెలుగు చీకటిని తొలగించి, మీ జీవితంలో ఆనందం, సంతోషం, శాంతితో పాటు కొత్త ఆశలను నింపాలని కోరుకుంటున్నాను” అని ప్రజలనుద్దేశించి ఆయన హృదయపూర్వక విషెస్ చెప్పారు.