News January 10, 2025
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Similar News
News January 24, 2025
దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి: కలెక్టర్
సంగెం మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై వచ్చిన దరఖాస్తులను ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తప్పులు దొర్లకుండా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 23, 2025
వరంగల్ మార్కెట్కి అరుదైన మిర్చి ఉత్పత్తుల రాక
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. ఎల్లో మిర్చి క్వింటా రూ.18 వేలు, 2043 రకం మిర్చి రూ.14 వేలు, 273 రకం మిర్చి రూ. 12వేలు, హరిణి మిర్చి రూ.14 వేలు, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది.అలాగే పాత తేజా మిర్చి ధర రూ.13,300, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.13,600, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.
News January 22, 2025
మట్టెవాడ: విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన సదస్సు
మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై మట్టెవాడలోని ఓ కళాశాలలో విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. వీటితో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, ర్యాగింగ్, షీ టీం పోలీసుల పనితీరు గురించి వివరించారు. పోలీసులను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.