News October 28, 2024

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రా లకు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో (ప్రతి ఆదివారం) డిపోల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు.

Similar News

News January 5, 2026

NLG: మండలాల్లో అటకెక్కిన ప్రజావాణి

image

NLGలో ప్రజావాణికి వినతులు వెల్లువెత్తడంతో, గత ప్రభుత్వం మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అనేక మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మొదట్లో మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో కొద్దిరోజులు నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం అన్ని చోట్లా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం తిరిగి జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.