News January 25, 2025
పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ: కలెక్టర్

2025-26 కు సంబంధించి వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను నిర్ధారించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం ఏలూరులో నిర్వహించారు. వివిధ పంటలు, పాడిపశువుల పెంపకానికి, చేపల పెంపకానికి సంబంధించి పెంచిన రుణపరపతి వివరాల ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 22, 2025
పాల్వంచ: ఈనెల 24న జాబ్ మేళా..

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెక్నీషియన్, ట్రైనీ టెక్నీషియన్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ లేదా ఐటీఐ చేసిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యా అర్హత పత్రాలతో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.
News October 22, 2025
థాంక్స్ చెబుతూనే మోదీ చురకలు!

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పీఎం మోదీ <<18069464>>థాంక్స్ చెప్పిన <<>>విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధన్యవాదాలు చెబుతూనే ట్రంప్కు చురకలు అంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఐక్యంగా వ్యతిరేకించాలంటూ ప్రధాని హితవుపలికారు. పాక్ను ట్రంప్ సపోర్ట్ చేస్తుండటాన్ని పరోక్షంగా గుర్తు చేశారని, ఇదే సమయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News October 22, 2025
తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సూచనలు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు పొంగే చోట అధికారులు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.