News February 5, 2025

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI

image

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News January 19, 2026

జాతీయ వేదికపై ప్రసంగించనున్న జగిత్యాల డాక్టర్

image

JGTL ప్రముఖ డాక్టర్ భీ.శంకర్‌కు జాతీయ ఫిజీషయన్ల సదస్సుకు ఆహ్వానం లభించింది. ఆయన రచించిన “శ్వాసకోశ ఉబ్సస వ్యాధులు-ఆధునిక చికిత్సా పద్ధతులు” అనే వ్యాసం “మెడిసిన్ అప్‌డేట్-2026”లో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నెల 29న పాట్నాలో జరిగే జాతీయ సదస్సులో పుస్తక ఆవిష్కరణలో పాల్గొని, 30న జాతీయ వేదికపై ప్రసంగించనున్నారు. FEB 1న “కీళ్ళ వ్యాధులు-చికిత్సలు, జాగ్రత్తలు” అంశంపై సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

News January 19, 2026

ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలంటే..

image

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్‌వాష్‌లు ఉన్నాయి. వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ కలిగి ఉన్న ఫేస్‌వాష్‌లు చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ముఖానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్, డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచిది.

News January 19, 2026

‘అందుబాటులో పర్యాటక అందాలు’ పోస్టర్లు ఆవిష్కరణ

image

నంద్యాల జిల్లాలోని బిల్వ స్వర్గం, వాల్మీకి గుహలను విద్యార్థుల క్షేత్ర పర్యటన జాబితాలో చేర్చాలని టూరిజం డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ కలెక్టర్ రాజకుమారిని కోరారు. సోమవారం ‘అందుబాటులో పర్యాటక అందాలు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ చర్య వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.