News June 18, 2024
పంట నష్టాన్ని నివేదించండి: నంద్యాల జిల్లా కలెక్టర్

నంద్యాల జిల్లాలో గత సంవత్సరం రబీ సీజన్లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News November 26, 2025
జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.
News November 26, 2025
జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.
News November 26, 2025
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. యువత పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.


