News October 25, 2024
పంట నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

సంజామల మండలం ముదిగేడులో విషాదం నెలకొంది. పసుపల పెద్ద అలీఖాన్(58) ప్రమాదవశాత్తు పంట నూర్పిడి యంత్రంలో పడి గురువారం దుర్మరణం చెందాడు. అతని తల, శరీరం నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అలీఖాన్ సహా పలువురు కూలీలను గ్రామానికి చెందిన సూర్యుడు పంట నూర్పిడికి తీసుకెళ్లారు. యంత్రంపై నిలబడి మినుమును వేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. సోదరుడు మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 29, 2025
కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. స్టడీ క్లాసులు లేదా అదనపు తరగతులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్ద సురక్షితంగా ఉంచాలని సూచించారు.
News October 29, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 29, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

నవంబర్లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.


