News October 12, 2024

పండగ వేళ బోధన్‌లో కత్తిపోట్లు

image

దసరా పండగ వేళ బోధన్ పట్టణంలోని గాంధీనగర్లో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. కాలనీకి చెందిన రేహాన్, జావిద్, బబ్లు ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వెళ్తున్న మన్సుర్ తన గురించే వారు మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులు కేసు, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 12, 2024

NZB: దసరా వేడుకల్లో దిల్ రాజు, సినీ హీరో ఆశిష్

image

NZB జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ హీరో ఆశిష్ పాల్గొన్నారు. వేద పండితుల మధ్యన శమి వృక్షానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని పల్లకీ మోశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, విజయ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News October 12, 2024

NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లకు మెడల్స్

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మెడల్స్ సాధించారు. మలేషియాలో నిర్వహిస్తున్న 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో శుభారంభం పలికారు. ఇందులో భాగంగా 35+ ఏజ్ గ్రూపులో జరిగిన లాంగ్ జంప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాగ్మారే దినేష్ గోల్డ్ మెడల్, యాష్లీ గోపి సిల్వర్ మెడల్ సాధించారు. వీరు విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఉన్నారు.

News October 12, 2024

NZB: విషాదం.. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

image

బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన మల్లారం(55) అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై మశ్చేందర్ రెడ్డి తెలిపారు. గ్రామ శివారులో గల బెల్లాల్ చెరువులోకి చేపలు పట్టడానికి వల వేసే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని అన్నారు.