News March 16, 2025
పంతంగి టోల్ ప్లాజా వద్ద గంజాయి పట్టివేత

భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని SOT పోలీసులు పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. మొత్తం 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చౌటుప్పల్ పోలీసులు తెలిపారు.
Similar News
News November 6, 2025
NH అధికారులపై MLAలు సీరియస్.. DPR తయారు చేయడం మీ ఇష్టమేనా.?

విజయవాడ-మచిలీపట్నం NH-65 ఆరు లైన్ల విస్తరణ డీపీఆర్ తయారీపై కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్హెచ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంకిపాడు వరకు భవిష్యత్తులో మెట్రో, నగర విస్తరణ ఉంటుందని పేర్కొంటూ.. బెంజ్ సర్కిల్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్) లేదా రద్దీ మార్గాల్లో అండర్ పాస్ల నిర్మాణం చేయాలని సూచించారు. డీపీఆర్లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు.
News November 6, 2025
వరంగల్: గురుకుల ఘటనపై కలెక్టర్ సీరియస్..!

వరంగల్ జిల్లా పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి <<18190237>>విద్యార్థిని వల్లందాసు శివానిని పాఠశాల నుంచి పంపించిన ఘటనపై <<>>కలెక్టర్ డాక్టర్ సత్య శారద సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించి బుధవారం ప్రిన్సిపల్తో పాటు విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులపై కలెక్టర్ మండిపడినట్లు సమాచారం. విద్యార్థినిని పాఠశాలలో చేర్చుకోవాలని ఆదేశించారు.
News November 6, 2025
SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.


