News January 31, 2025

పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు: భద్రాద్రి కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించొద్దన్నారు.

Similar News

News February 12, 2025

భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..

image

శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.

News February 12, 2025

KMR: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.

News February 12, 2025

RTC బస్సు ఢీకొని మహిళ మృతి.. రూ.9 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశం

image

USలో ఉద్యోగం చేసే లక్ష్మీ 2009లో INDకు వచ్చి ఫ్యామిలీతో కలిసి కారులో రాజమండ్రి వెళ్తుండగా APSRTC బస్సు ఢీకొట్టింది. లక్ష్మీ మృతి చెందడంతో RTC నుంచి రూ.9Cr పరిహారం ఇప్పించాలని ఆమె భర్త శ్యాం మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ట్రిబ్యునల్ రూ.8.05Cr చెల్లించాలని చెప్పింది. అయితే RTC HCకి వెళ్లగా రూ.5.75Crకు తగ్గించింది. దీన్ని శ్యాం SCలో సవాల్ చేయగా రూ.9Cr చెల్లించాలని తాజాగా ఆదేశించింది.

error: Content is protected !!