News February 11, 2025

పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు : ASF కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

Similar News

News February 8, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాలపై వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. అల్లరి మూకలను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు భయం లేకుండా ఓటు వేయాలని సూచించారు.

News February 8, 2026

సిద్దిపేట: టీ మాస్ నూతన కమిటీ ఎన్నిక

image

సిద్దిపేటలో ప్రాక్టీస్ చేస్తున్న మాదిగ న్యాయవాదులతో సమావేశం నిర్వహించి తెలంగాణ మాదిగ అడ్వకేట్స్ సంఘం (టీ మాస్)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా భూమిగారి మనోహర్, భూపతి, చింతమడక కన్నయ్య, యాదగిరి ఎంపికయ్యారు. వ్యవస్థాపక జిల్లా అధ్యక్షునిగా కర్రోల్ల రవిబాబు, ఉపాధ్యక్షులుగా జేరిపోతుల యాదగిరి, రమేష్, సురేందర్, శ్రీనివాస్, యుగంధర్‌ను నియమించారు.

News February 8, 2026

గౌడన్న.. కల్లు ఎంతకు అమ్ముతున్నావు?: మంత్రి తుమ్మల

image

‘గౌడన్న కల్లు ఎంతకు అమ్ముతున్నావు? రక్షణ కిట్లు మీ పొన్నం సార్ పంపించారా’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ గీత కార్మికుడిని అడిగిన ప్రశ్నలు ఇవి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లకు వస్తున్న మంత్రి కాన్వాయ్‌ని రగుడు ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. రగుడుకు చెందిన ఓ గీత కార్మికుడు తుమ్మలను కలిసి రక్షణ కిట్లు అందాయని, రూ.100కు లీటర్ కల్లు అమ్ముతున్నానని మంత్రికి తెలిపాడు.