News March 2, 2025

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News January 3, 2026

నిజామాబాద్: శాంతి భద్రతలపై పోలీసుల ఫోకస్

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా జనవరి 1 నుంచి 15 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా విగ్రహ ప్రతిష్ఠలు చేయకూడదన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు DJలు నిషేధించినట్లు చెప్పారు. బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు ఉంటాయని, డ్రోన్లు, భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

News January 3, 2026

తాడేపల్లి నుంచే మళ్లీ జనంలోకి YS జగన్.?

image

2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత YS జగన్ తాడేపల్లి నుంచే మళ్లీ జనంలోకి వెళ్లే వ్యూహానికి తెరలేపుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో ‘జనంలో ఉండటమే బలం’ అనే నమ్మకంతో పనిచేసిన జగన్, అదే ఫార్ములాను తిరిగి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. పరామర్శలు, వివాహాల పేరుతో సాగుతున్న పర్యటనలు, అనూహ్యంగా రోడ్‌షోలుగా మారుతున్న నేపథ్యంలో తాడేపల్లి రాజకీయాలకు ప్రాధాన్యత పెరిగింది.

News January 3, 2026

‘MGNREGA బచావో సంగ్రామ్’ పేరుతో కాంగ్రెస్ పోరుబాట!

image

ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ‘MGNREGA బచావో సంగ్రామ్’ను ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది కేవలం పేరు మార్పు కాదని, గ్రామీణ పేదల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు. జనవరి 8 నుంచి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. VB G RAM G చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలన్నారు.