News March 2, 2025

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News January 6, 2026

₹19,391CR పెట్టుబడులు…11,753 ఉద్యోగాలు

image

AP: CM CBN అధ్యక్షతన జరిగిన SIPB సమావేశం 14 సంస్థలకు సంబంధించిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 11,753 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాగా పాలసీలను అందరికీ సమానంగా అమలుచేయాలని CBN సమావేశంలో స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఉద్యాన పంటల ఉత్పత్తులు భారీగా వస్తాయని, అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని చెప్పారు. స్పేస్ సిటీ కోసం 5వేల ఎకరాలు అవసరమన్నారు.

News January 6, 2026

సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట: ఎస్పీ రాజేష్ చంద్ర

image

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన సందర్శించి, ఈ-చాలన్ల విధింపు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించబడి ఉన్నాయన్నారు.

News January 6, 2026

గడువులోగా అభ్యంతరాలను సమర్పించాలి: నిర్మల్ కలెక్టర్

image

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై ఉన్న అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేరు వేరుగా ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియపై వివరించారు.