News March 6, 2025

పకడ్బందీగా పది పరీక్షలు: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేశ్‌ వి పాటిల్ హాజరై పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 12282 మంది, ప్రైవేట్ విద్యార్థులు 686 మంది హాజరవ్వనున్నారు.

Similar News

News October 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 16, 2025

MNCL: ఈ నెల 17న మినీ జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ
చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 16, 2025

IPS పూరన్ భార్య, బావమరిదిపై కేసు

image

IPS పూరన్ కుమార్ సూసైడ్, ఆపై ASI సందీప్ ఆత్మహత్య వ్యవహారం మరిన్ని ట్విస్టులతో సాగుతోంది. సందీప్ భార్య ఫిర్యాదుతో పూరన్ భార్య అమ్నీత్(IAS), బావ మరిది అమిత్ రట్టన్(MLA), సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ వీడియో, సూసైడ్ నోట్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. కేసు పెట్టే వరకు సందీప్ పోస్టుమార్టానికి ఆయన కుటుంబం అంగీకరించలేదు.