News February 11, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: డీఆర్వో

మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా డీఆర్వో విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23,730 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News January 11, 2026
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కేటీఆర్ సమీక్ష

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
News January 11, 2026
ప.గో: ఖద్దరు ఓకే.. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఖాకి!

ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ నేతలు ఇప్పటికే బిరుల(పందెం బరి) నిర్వాహకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తుంటే ఖాకీలు మాత్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి తాను చేప్పేవరరకు వరకు అమ్యామ్యాలు తీసుకోవద్దు అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పందాల నిర్వాహకులు మాత్రం ఆదేశాలు అందాయా.? లేదా.? అని పోలీసులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News January 11, 2026
ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ దోస్తీ.. మరోసారి బయటపడిందిలా..!

పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా నేత సైఫుల్లా కసూరి.. పాకిస్థాన్లోని ఒక స్కూల్ ఫంక్షన్లో ప్రసంగించడం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ తనకు ఇన్విటేషన్లు పంపుతుందని, చనిపోయిన సైనికుల అంత్యక్రియలకు తనని పిలిచి ప్రార్థనలు చేయిస్తారని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇండియా తనని చూస్తేనే భయపడుతుందంటూ ఈ వేదికపై విషం చిమ్మాడు.


