News February 11, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: డీఆర్వో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739266238429_51971370-normal-WIFI.webp)
మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా డీఆర్వో విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23,730 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News February 12, 2025
ములుగు: పోస్టల్లో ఉద్యోగ అవకాశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295639222_930-normal-WIFI.webp)
ఇండియన్ పోస్ట్ 21,413 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ డివిజన్ పరిధిలో 29 ఖాళీలున్నాయి. దీనికి పదవ తరగతి అర్హులు కాగా.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారం రిక్రూట్మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ వారికి రూ.100 కాగా మిగితా వారికి ఉచితం. మార్చి 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
త్వరలో గూగుల్ మెసేజెస్ యాప్ నుంచే వాట్సాప్ కాల్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739315068450_893-normal-WIFI.webp)
గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా WhatsApp వీడియో కాల్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా Google meet వీడియో కాల్స్ మాత్రమే చేసుకునేందుకు వీలుంది. అయితే యాప్స్ను స్విచ్ చేసుకునే బదులు, యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త ఫీచర్ను గూగుల్ తీసుకొస్తోంది. తొలుత వన్ ఆన్ వన్ కాల్స్కు మాత్రమే ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.
News February 12, 2025
జనగామ: మున్సిపాలిటీ వార్డు అధికారులతో కలెక్టర్ సమీక్షా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739288912482_52152631-normal-WIFI.webp)
జనగామ మున్సిపాలిటీ వార్డు అధికారులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని టాక్సీ వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, ప్లాంటేషన్ తదితర విషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్లపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటి పరిధిలో రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.