News February 20, 2025
పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2, మార్చి 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ మహేశ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించారు.
Similar News
News December 1, 2025
గంభీర్.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్పూర్లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.
News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
News December 1, 2025
భారీ జీతంతో ECGC లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, MA(హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. DEC 15నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.


