News February 20, 2025
పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2, మార్చి 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ మహేశ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించారు.
Similar News
News January 7, 2026
సిరిసిల్ల: ‘యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు’

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామన్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో యూరియా కొరత ఉన్నట్లు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
News January 7, 2026
అబార్షన్ అయిందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి

వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావొచ్చు. దీని తర్వాత ఆ మహిళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. రెండు వారాలకు మీరు మామూలుగా ఇంటి పనులు, వ్యాయామం, యోగా మొదలుపెట్టవచ్చు. అయితే అబార్షన్ తర్వాత నెలసరి అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. 3నెలలపాటు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకున్న తరువాతే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి.
News January 7, 2026
సంగారెడ్డి: అల్పాహారం నిధులు విడుదల

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల వేళ అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని సంగారెడ్డి డీఈఓ తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అల్పాహారం అందించాలని, ఇందుకోసం జిల్లాకు రూ. 26,14,590 మంజూరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.


