News February 20, 2025

పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

image

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2, మార్చి 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ మహేశ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించారు.

Similar News

News December 18, 2025

రేషన్ కార్డుదారులు e-KYC తప్పనిసరి: DSO

image

రేషన్ కార్డుదారులందరికీ e-KYC తప్పనిసరి అని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రేషన్ డీలర్లు షాపులను తెరిచి ఉంచి, తమ పరిధిలోని కార్డుదారులందరితో 100 శాతం e-KYC చేయించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించి, గడువులోగా ప్రక్రియ ముగిసేలా చూడాలని స్పష్టం చేశారు.

News December 18, 2025

రేవంత్‌ రెడ్డి పతనానికి సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం: హరీష్‌రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పతనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. మెదక్‌లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

News December 18, 2025

సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

image

సుక్మా జిల్లా పరిధిలోని గొండిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళ మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందారు. సుక్మా పోలీసుల వివరాలు.. గొండిగూడ అడవుల్లో మావోలు ఉన్నారన్న సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఏసీఎం ర్యాంకు, ఒక ఎల్ఓఎస్ సభ్యురాలు మృతి చెందారన్నారు. వారి వద్ద 9 ఎంఎం సర్వీస్ పిస్టల్, 12 బోర్, బార్మర్ గన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.