News February 20, 2025
పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2, మార్చి 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ మహేశ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించారు.
Similar News
News October 17, 2025
బీజేపీ, బీఆర్ఎస్కు బీసీల పట్ల ప్రేమ లేదు: పెద్దపల్లి ఎమ్మెల్యే

ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ మొదటినుంచి నినదిస్తోందని తెలిపారు. బీసీ కుల గణన నిర్వహించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కు బీసీల పట్ల ప్రేమ లేదన్నారు.
News October 17, 2025
ప్రసూతి మరణాల నివారణకి చర్యలు: కలెక్టర్

ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రసూతి మరణాలపై సమీక్షించారు. మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News October 17, 2025
యాదాద్రి భువనగిరి ట్రెసా నూతన కార్యవర్గం ఏకగ్రీవం

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎం. కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆర్. శ్రీకాంత్, కోశాధికారిగా జానయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎండీ లాయక్ అలీ ఎన్నికయ్యారు. బొమ్మలరామారం సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ శోభతో పాటు మరో 19 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.