News February 10, 2025
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ: డిఐఈఓ

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ కే రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈనెల 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.
Similar News
News December 7, 2025
పాడేరులో ప్రమాదం.. విద్యార్థి మృతి

పాడేరు మండలం గబ్బంగి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి శ్రీరామబద్రి (15) మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఆదివారం వంజంగి వెళ్లేందుకు బైక్పై లిఫ్ట్ అడిగి ఎక్కిన శ్రీరామ్, గబ్బంగి మలుపు వద్ద బైక్ వేగంగా వచ్చి సిగ్నల్ పోల్ను ఢీకొనడంతో ఎగిరిపడి మృతి చెందాడు. మృతుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
News December 7, 2025
స్కూల్పై దాడి.. 43 మంది చిన్నారులు మృతి

సుడాన్లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 7, 2025
‘ క్రీమీలేయర్’ తీర్పుతో సొంతవర్గం నుంచే విమర్శలు: గవాయ్

SC రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలు తీర్పుతో తాను సొంతవర్గాల నుంచే విమర్శలు ఎదుర్కొన్నానని మాజీ CJI గవాయ్ పేర్కొన్నారు. ‘అంబేడ్కర్ దృష్టిలో జీరో దగ్గర ఉన్న వెనుకబడ్డ వ్యక్తికి సైకిల్ ఇవ్వాలి. అప్పుడే అతడు సైకిల్పై ముందున్న వారిని చేరుకొని సమానంగా నడుస్తాడు. అంతే తప్ప సైకిల్పై ఎప్పటికీ అతడే వెళ్తూ జీరో దగ్గర ఉన్నవారిని అలాగే ఉండాలనరాదు’ అని ముంబై వర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.


