News April 5, 2024
పకడ్బందీగా పర్యవేక్షణ జరగాలి: కలెక్టర్
సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అనంతపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు.
Similar News
News January 14, 2025
రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు: ఎస్పీ
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపుగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. హెల్మెట్/ సీటుబెల్టు ధరించడంతో పాటు త్రిబుల్ రైడింగ్, ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, తదితర ఉల్లంఘనలకు దూరంగా ఉండాలన్నారు. మోటారు వాహనాల చట్ట ప్రకారంగా గడిచిన వారం రోజుల్లో 2,881 కేసులు నమోదు చేశామన్నారు.
News January 13, 2025
BREAKING: తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి
తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రోహిత్ 2022 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి.
News January 13, 2025
అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి
కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.