News March 17, 2025

ప‌క‌డ్బంధీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాలి: కలెక్టర్

image

ప‌క‌డ్బంధీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమ‌వారం నుంచి ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో, ప‌లు ప‌రీక్షా కేంద్రాల‌ను ఆయ‌న త‌నిఖీ చేశారు. ముందుగా కంటోన్మెంటులో సెయింట్ ఆన్స్ బాలికోన్న‌త పాఠ‌శాల‌ను, మున్సిప‌ల్ ఉన్న‌త‌ పాఠ‌శాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించారు.

Similar News

News March 18, 2025

VZM: విన‌తుల‌ను పరిష్క‌రించి తెలుగులోనే సమాచారం ఇవ్వాలి

image

ప్ర‌జా విన‌తుల ప‌రిష్కార వేదిక‌లో వివిధ వ‌ర్గాలు ఇచ్చే విన‌తుల‌ను పరిష్క‌రించిన అనంత‌రం తెలుగులో వారికి అర్ధ‌మ‌య్యే రీతిలో సమాచారం ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేడ్కర్ ఆయా డివిజన్‌ల అధికారులను ఆదేశించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. వ‌చ్చిన ప్ర‌తి విన‌తిని పరిష్క‌రించిన త‌ర్వాత ఆయా విన‌తులు అందించిన వారితో మాట్లాడి వారు ఇచ్చిన విన‌తులను పరిష్కరించాలన్నారు.

News March 18, 2025

VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 283 మంది మందుబాబులపై కేసులు నమోదు చేసారన్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారని తెలిపారు. ఇకనైనా పద్ధతులను మార్చుకొవాలన్నారు.

News March 17, 2025

గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు

image

గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.

error: Content is protected !!