News May 25, 2024
పచ్చటి పల్నాడు పల్లెల్లో రాజకీయ కార్చిచ్చు

పాడి పంటలతో కళకళలాడే పచ్చటి పల్నాడు జిల్లాలో రాజకీయ కార్చిచ్చుకు ఆహుతై పోతున్నాయి. కులమతాలకు అతీతంగా ఉండే ఆత్మీయులే ఎన్నికల సమయానికి బద్ధ శత్రువులుగా మారుతున్నారు. క్షణికావేశంలో జరిగే దాడులతో పురుషులు జైళ్ళపాలు అవుతుంటే.. మహిళలు వ్యవసాయ కూలీలవుతున్నారు. పల్నాడు ఫ్యాక్షన్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉండగా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు.
Similar News
News November 20, 2025
చేపలకోసం వల వేస్తే.. చిక్కిన కొండచిలువ

చేపల కోసం ఓ జాలరి వేసిన వలలో చేపలకు బదులు కొండచిలువ పడిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి పంప్ హౌస్ వద్ద బకింగ్ కెనాల్ కాలువలో గురువారం ఓ జాలరి చేపలు పట్టేందుకు కృష్ణా నదిలోకి వల వేయగా కొద్దిసేపటికి వల బరువుగా తగిలింది. దీంతో చేపలు బాగా పడ్డాయి అనుకుంటూ వలనిపైకి తీసి చూడగా అందులో ఉన్న కొండచిలువను చూసి ఒక్కసారిగా అవాకయ్యాడు. తాను ఎప్పుడూ ఇలా పాము రావడం చూడలేదని జాలరి చెప్పాడు.
News November 20, 2025
ANU: ‘మాస్ కాపీయింగ్కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
News November 20, 2025
ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.


