News February 4, 2025
పటాన్చెరు: అడవి పందిని తప్పించబోయి గన్మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్పల్లి మం. బుల్కాపూర్ వాసి. AR కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం పటాన్చెరు మం. వెలిమలలో బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్కు <<15346562>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News March 5, 2026
గద్వాల జిల్లాను టాప్లో నిలపండి: కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, ఈ ఏడాది ఫలితాల్లో గద్వాల జిల్లాను రాష్ట్రంలో టాప్-15 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గద్వాల ఐడీవోసీ నుంచి నిర్వహించిన జూమ్ అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా తగినంత నీరు తాగాలని, 6-8 గంటల నిద్ర తప్పనిసరన్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు.
News March 5, 2026
పాలమూరు వర్సిటీ విద్యార్థులకు రూ.6లక్షల ప్యాకేజీ

పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులు కొలువుల వేటలో సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఆరుగురు విద్యార్థులు ఏడాదికి రూ.6 లక్షల భారీ వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేల (ఏడాదికి 1.80 లక్షలు) చొప్పున వేతనం పొందుతారని, అనంతరం పూర్తి స్థాయి ప్యాకేజీ అందుతుందని వర్సిటీ ఉపకులపతి ప్రొ. శ్రీనివాస్ తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
News March 5, 2026
హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

TG: రంజాన్లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.


