News February 13, 2025

పటాన్‌చెరు: ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

image

వేప చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు పట్టణానికి చెందిన చిరుమణి కృష్ణ (68) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 12, 2025

ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

image

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>

News November 12, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.

News November 12, 2025

ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు: చంద్రబాబు

image

AP: మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని CM చంద్రబాబు అన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు రూ.5వేలు ఇస్తామన్నారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేసినా మైనారిటీల ద్వారానే ఆస్తుల సంరక్షణ చేస్తామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి అందరూ పరిశీలించేలా చేస్తామన్నారు.