News February 13, 2025

పటాన్‌చెరు: ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

image

వేప చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు పట్టణానికి చెందిన చిరుమణి కృష్ణ (68) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 23, 2026

మక్తల్: ముగిసిన సీఎం కప్ కబడ్డీ పోటీలు

image

మక్తల్‌లో నిర్వహించిన సీఎం కప్ కబడ్డీ పోటీలు సోమవారంతో ముగిశాయి. క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై ఆసక్తి చూపాలని మంత్రి సూచించారు.

News February 23, 2026

ఏలూరు జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే!

image

ఏలూరు జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News February 23, 2026

అనంతపురం: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన బి.ఫార్మసీ 3-1, 3-2 (R15, R19, R23) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.