News February 13, 2025

పటాన్‌చెరు: ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

image

వేప చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు పట్టణానికి చెందిన చిరుమణి కృష్ణ (68) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 3, 2026

తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించాలి: కలెక్టర్

image

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. బీఎల్ఓలు ప్రతిరోజూ 30 నుంచి 40 ఎంట్రీలు చేస్తూ, ఇంటింటి సర్వే ద్వారా తప్పుల్లేని జాబితా సిద్ధం చేయాలన్నారు.

News January 3, 2026

HYD: లీకేజీలను గుర్తించేంచుకు ‘రోబోటిక్’ టెక్నాలజీ

image

HYDలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గత రెండేళ్లలో అందిన ఫిర్యాదులను విశ్లేషించి, కలుషిత నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల్లోగా పాత పైప్‌లైన్లను మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. లీకేజీలను త్వరితగతిన గుర్తించేందుకు ‘రోబోటిక్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. ఫిర్యాదులను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు.

News January 3, 2026

ఉత్తమ్‌కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే అధ్యక్షా: రేవంత్

image

TG: నీటి వివాదాల అంశం ఎంతో క్లిష్టమైనదని అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. ‘బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వివాదంపై చాలా స్టడీ చేశారు. ఈ చదువు ఆయన గతంలోనే చదివితే నాలుగు సార్లు ఐఏఎస్ అయ్యేవారు అధ్యక్షా. ఇప్పటికైనా మీరు రికమండ్ చేసి అంబేడ్కర్ వర్సిటీ నుంచి డాక్టరేట్ ఇప్పించాల్సిందే అధ్యక్షా’ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.