News February 13, 2025

పటాన్‌చెరు: ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

image

వేప చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు పట్టణానికి చెందిన చిరుమణి కృష్ణ (68) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 17, 2025

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

image

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.

News November 17, 2025

KNR: ఓపెన్ స్కూల్ సొసైటీలో భారీ SCAM

image

ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో రూ.కోటి వరకు కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. స్టడీ సెంటర్ల నిర్వహణ కోసం వచ్చిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 180 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉండగా.. ఒక్కో స్టడీ సెంటర్‌కు రూ.30వేల వరకు నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇంతకుముందు కో- ఆర్డినేటర్‌గా పనిచేసిన ఉద్యోగికి ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

News November 17, 2025

శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

image

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>