News February 13, 2025

పటాన్‌చెరు: ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

image

వేప చెట్టుకు ఉరివేసుకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు పట్టణానికి చెందిన చిరుమణి కృష్ణ (68) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కడుపునొప్పి భరించలేక ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 26, 2025

గొల్లగూడెంలో CM పర్యటన.. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన SP

image

ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో డిసెంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ భద్రత ఏర్పాట్లు పరిశీలించి అధికారులకి కీలక సూచనలు చేశారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యత వహించాలని ఆదేశించారు.

News November 26, 2025

ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

image

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.

News November 26, 2025

HYD: త్వరలో కొత్త బస్ డిపోలు.. ప్రతిపాదించిన ఆర్టీసీ

image

మహానగరం విస్తరించనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచి అదనపు డిపోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం గ్రేటర్లో 25 డిపోల పరిధిలో 3,100 బస్సులు సేవలందిస్తున్నాయి. బస్సుల సంఖ్యను పెంచి మరో 16 డిపోలను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుందని సమాచారం.