News July 2, 2024
పటాన్చెరు: కరెంట్ షాక్తో ఆటో డ్రైవర్ మృతి

కరెంట్ షాక్ తగిలి ఓ ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో ఉంటున్న శ్రీనివాస్ గౌడ్(46) ఆటో డ్రైవర్. సోమవారం ఆటోను తడి బట్టతో శుభ్రం చేశాడు. అనంతరం దాన్ని వైరుపై ఆరేయగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 27, 2025
నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలి: SP

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. హవేలిఘనపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు, నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
News November 26, 2025
మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
News November 26, 2025
మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.


