News April 7, 2024
పటాన్చెరు: మోసపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
ఆన్లైన్ ఉద్యోగం అంటూ వచ్చిన ప్రకటనకు స్పందించిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసపోయింది. అమీన్ పూర్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ మెడోస్ కాలనీలో నివాసం ఉంటున్న ఉద్యోగిని ఫోన్కు గతనెల 13న ఆన్లైన్ జాబ్ అంటూ లింకు వచ్చింది. టాస్కులు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామనడంతో రూ.2.92 లక్షలు వేసింది. తర్వాత అవతలి వ్యక్తులు స్పందించలేదు. దీంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 20, 2025
మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.
News January 19, 2025
డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
News January 18, 2025
BREAKING.. మెదక్: అన్నను చంపిన తమ్ముడు
మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తండాలో తమ్ముడు అన్నను హత్య చేశాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అన్నదమ్ములు శంకర్ (28), గోపాల్ రాత్రి ఒకే రూంలో పడుకున్నారు. తెల్లవారుజామున అన్న కాలికి కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చి చూసే వరకే శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.