News June 23, 2024
పటాన్చెరు: రూ.1.05 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

టాస్క్లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 21, 2025
మెదక్: డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలి: కలెక్టర్

యువత, విద్యార్థులు సహా ప్రతీ ఒక్కరూ మత్తు పదార్థాలు, డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలనపై అధికారులు, పోలీసు సిబ్బందితో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం పెరిగిపోతూ, మహమ్మారి లా సమాజాన్ని, యువతను చెడు మార్గం వైపు నడిపిస్తుందన్నారు.
News November 21, 2025
మెదక్: కలెక్టర్ను కలిసిన కొత్త డీఈఓ విజయ

జిల్లా విద్యాధికారిగా, జిల్లా విద్యా శిక్షణ సంస్థ హవేలీ ఘనపూర్ ప్రిన్సిపల్గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విజయ కలెక్టర్ రాహుల్ రాజ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొని పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, ఆడల్ట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ మురళి ఉన్నారు.
News November 21, 2025
మెదక్: రోడ్డు ప్రమాదాలతో ప్రాణ, ఆర్థిక నష్టం: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతున్న సందర్భంగా రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో ఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలలో గణనీయమైన తగ్గుదల సాధ్యమని పేర్కొన్నారు.


