News January 28, 2025

పటిష్ట కార్యాచరణలతో అమలు చేయాలి: కలెక్టర్ 

image

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి1న చేపట్టనున్న లక్ష గృహాల ప్రవేశాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో 6 వేల ఇళ్ల లబ్దిదారులకు తాళం చెవులు అందించే కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో అమలు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరులో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మిగిలిన ఇళ్లు పనులు యుద్దప్రాదిపదికన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 7, 2025

వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

image

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్‌ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.

News November 7, 2025

డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

image

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేశారు.

News November 7, 2025

NZB: 38.15 లక్షలు తీసుకొని మోసగించిన మహిళ అరెస్ట్

image

నిజామాబాద్‌లో డబ్బుల పేరుతో ప్రజలను మోసగించిన మహిళను అరెస్టు చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. ఇటీవల మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురి వద్ద 3 ఎకరాల భూమి ఇస్తానని నమ్మించి వారి నుంచి రూ.38.15 లక్షలు తీసుకొని మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వర్ణ ప్రమీలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి బాధితుల చెక్కులు, ప్రాంసరీ నోట్లు, స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.