News February 20, 2025
పటిష్ఠ చర్యలు చేపట్టండి: నగర మేయర్

వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.
Similar News
News March 21, 2025
శ్రీసిటీలో మరో కంపెనీ ప్రారంభం

శ్రీసిటీలో మరో కొత్త కంపెనీ ప్రారంభమైంది. ఓజెఐ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ఓపెన్ చేశారు. కంపెనీ కస్టమర్లు, సరఫరాదారులు, ప్రతినిధుల సమక్షంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఓజీ ఇండియా ప్యాకేజింగ్ సీఈవో యోషియుకి కురహషి రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. 100 మిలియన్ల వార్షిక సామర్థ్యంతో అట్ట పెట్టెలు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తామని తెలిపారు.
News March 21, 2025
NLG: GOOD NEWS.. తీరనున్న తాగునీటి సమస్య

వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకుగాను, తాగునీటి బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, తాగునీటి ట్యాంకుల మరమ్మతులకు గాను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 827 తాగునీటి పనులు చేపట్టేందుకు DMFT నిధుల నుంచి రూ.5 కోట్ల 10 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎక్కడా తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News March 21, 2025
వారి నవ్వు చూసి నాకు సంతోషం కలిగింది: నాగబాబు

AP: శాసనసభ కల్చరల్ ఈవెంట్లో CM చంద్రబాబు, Dy.CM పవన్ నవ్వడం చూసి తనకు సంతోషం వేసిందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘ఆ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన చంద్రబాబుకు జరిగిన అవమానానికి ఆయన కన్నీరు పెట్టడం ఎంతో బాధించింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. పని ఒత్తిడిలో పవన్ కూడా నవ్వడం చూసి సంతోషం వేసింది’ అని ట్వీట్ చేశారు.