News February 3, 2025
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం: ఎస్పీ

హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక సమయంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. ఒక్కరోజు ముందుగానే హిందూపురంలో పోలీసులతో సమావేశమై భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు ఎన్నికలు నిర్వహించామన్నారు.
Similar News
News February 9, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ బూతుల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 9, 2025
ADB: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ఆదిలాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మేకల రాములు పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కు చెందిన సాజిద్ ఆటోలో ఎక్కి ఓ ఆసుపత్రి వద్ద దిగిపోయాడు. అయితే ఆటోలోనే తన బ్యాగును మరచిపోయాడు. ఆటో డ్రైవర్ బ్యాగును గమనించి వన్ టౌన్ లో అప్పగించాడు. సీఐ సునిల్ కుమార్ బాధితుడిని గుర్తించి ఆ బ్యాగును బాధితునికి అప్పగించి ఆటో డ్రైవర్ సాజిద్ ను అభినందించారు.
News February 9, 2025
బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.