News April 25, 2024

పట్టభద్రుల ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

image

ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ప్రకటించారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. వరంగల్‌కు 34వ ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4678 మంది పరీక్షలు రాయగా 2844 మంది పాసై 60.80 శాతంతో స్టేట్‌లో 34వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 737 మందికి 545 మంది పాసై 73.95 శాతంతో 17వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 679 మందికి 193 మంది పాసై 28.42%తో 29వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 70 మందికి 40మంది పాసై 57.14%తో 9వ స్థానం వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్‌కు 30వ ర్యాంక్

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్‌కు 30వ ర్యాంక్

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.