News February 11, 2025
పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇంద్ర గౌడ్ నామినేషన్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి సిలివేరి ఇంద్ర గౌడ్ సోమవారం కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా పోటీ చేశానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Similar News
News March 26, 2025
నేటి ముఖ్యాంశాలు

* వచ్చే నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: చంద్రబాబు
* ఏప్రిల్ 1 నుంచి ఏపీలో ‘సదరమ్’ స్లాట్లు
* జగన్ ఇమేజ్ తగ్గించేందుకు కుట్ర: పేర్ని
* TG: 50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు: కూనంనేని
* రైతు భరోసా డబ్బులు విడుదల
* IPL: GTపై పంజాబ్ విజయం
News March 26, 2025
కామారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి’

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
News March 26, 2025
ఇప్పుడు అందాల పోటీలు అవసరమా?: కేటీఆర్

TG: ఈ-కార్ రేసుకు రూ.46 కోట్లు ఖర్చు చేస్తే రాద్ధాంతం చేశారని ఇప్పుడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారని KTR ప్రశ్నించారు. ఈ-రేస్తో రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని, మిస్ వరల్డ్ పోటీలతో ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని మంత్రి జూపల్లిని నిలదీశారు. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. వేసవిలో నీటి కష్టాలు తీర్చకుండా అందాల పోటీల నిర్వహణ ఎందుకని దుయ్యబట్టారు.