News February 4, 2025
పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన గవ్వల శ్రీకాంత్

జన్నారం మండలం కామన్పల్లికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సోమవారం కరీంనగర్లో నామినేషన్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పట్టభద్రులు తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
Similar News
News December 1, 2025
ములుగు: వాళ్లెందుకో వెనుకబడ్డారు..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిందా..!? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా ఆపార్టీ నేతలు ప్రభావవంతంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడు/ నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది. ఓ నేతకు ఆర్థిక సమస్య ఇబ్బందిగా మారిందని కేడర్ గుసగుసలాడుతోంది.
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
News December 1, 2025
SC కమిషన్ సెక్రటరీ కుమార్తె అనుమానాస్పద మృతి

రాష్ట్ర SC కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మాధురి అనుమానాస్పదంగా మృతి చెందారు. బేతంచెర్ల మం. బుగ్గానిపల్లె తండాకు చెందిన ఆమె రాజేశ్ నాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెను 3 నెలల క్రితం తల్లిదండ్రులు తీసుకెళ్లారని రాజేశ్ తెలిపారు. మరో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని, గర్భిణి అని చూడకుండా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేశ్ ఆరోపించడం సంచలనంగా మారింది.


