News February 5, 2025

పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్‌ను అందజేసిన కిషన్ రెడ్డి

image

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి బీఫామ్ ను బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News October 25, 2025

‘నిందితులకు శిక్ష పడేలా చేయడమే కోర్టు మానిటరింగ్ సెల్ లక్ష్యం’

image

సకాలంలో కోర్టుల్లో సాక్షులను ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడే విధంగా చేయడమే కోర్టు మానిటరింగ్ సెల్ లక్ష్యమని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు మానిటరింగ్ సెల్ జిల్లా సభ్యులతో ఆయన రివ్యూ నిర్వహించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

News October 25, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.

News October 25, 2025

పల్లీలే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు!

image

ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌ను మించిన ప్రయోజనాలు పల్లీల్లో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ కాలం జీవించేందుకు కావాల్సిన 20 అమైనో ఆమ్లాలు వీటిలో ఉన్నాయని తెలిపారు. ‘పల్లీల్లోని ప్రొటీన్ బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్, బీపీలను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డయాబెటిస్, క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది’ అని చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ తినే పల్లీలను తేలిగ్గా తీసిపారేయొద్దు.