News February 5, 2025
పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్ను అందజేసిన కిషన్ రెడ్డి

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి బీఫామ్ ను బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 3, 2025
హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్లో చేరుస్తారా?

జిల్లాల పునర్విభజన సమయంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అశాస్త్రీయంగా మూడు జిల్లాల్లో చేర్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్లో చేరుస్తామని PCC హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు CM హోదాలో హుస్నాబాద్కు వస్తున్న ఆయన దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి హుస్నాబాద్కు పునర్వైభవం తీసుకొస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఇదే అంశంపై మంత్రి పొన్నం CMతో చర్చించినట్లు తెలుస్తోంది.
News December 3, 2025
APPLY NOW: 252 అప్రెంటిస్ పోస్టులు

<<-1>>RITES<<>>లో 252 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ, BE, B.Tech, బీఆర్క్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 146 ఉండగా.. డిప్లొమా అప్రెంటిస్లు 49, ITI ట్రేడ్ అప్రెంటిస్లు 57 ఉన్నాయి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్సైట్: https://www.rites.com/
News December 3, 2025
రూ.2లక్షలు క్రాస్ చేసిన KG వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి చాలారోజులకు రూ.2లక్షల మార్కును దాటింది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.2,01,000గా ఉంది. అటు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,30,580గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.119700 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


