News February 5, 2025
పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్ను అందజేసిన కిషన్ రెడ్డి

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి బీఫామ్ ను బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 3, 2025
1,232 విమానాలు రద్దు: DGCA

IndiGo ఇటీవల 1,232 విమానాలను రద్దు చేసిందని DGCA ప్రకటించింది. ఇందులో సిబ్బంది, FDTL పరిమితుల వల్లే 755 ఫ్లైట్స్ రద్దయినట్లు పేర్కొంది. ATC సమస్యలతో 16% ఫ్లైట్స్, క్రూ రిలేటెడ్ డిలేస్తో 6%, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లిమిటేషన్స్ వల్ల 3% సర్వీసులు క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. OCTలో 84.1%గా ఉన్న IndiGo ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ NOVలో 67.7%కి డ్రాప్ అయిందని వివరించింది. HYDలోనూ పలు విమానాలు రద్దయ్యాయి.
News December 3, 2025
బాపట్ల: డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి బలి..!

సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పట్టాభిరామయ్య వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం అచ్చయ్యపాలెం గ్రామానికి చెందిన జాస్తి నాగేశ్వరరావు(54) టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News December 3, 2025
కామారెడ్డి: వరి కొనుగోలు డేటా ఎంట్రీపై కలెక్టర్ సమీక్ష

వరి కొనుగోలు ప్రక్రియ యాప్లో ఎంట్రీలపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య ద్వారా, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కొన్నిచోట్ల డేటా ఎంట్రీ పూర్తి చేయలేదన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, DRDO సురేందర్ పాల్గొన్నారు.


