News February 18, 2025

పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

image

పట్టిసీమ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం, తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివ రాత్రి ఉత్సవాలు పట్టిసీమ వద్ద గోదావరి మధ్యన ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో జరుగనున్నాయి.  శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. 

Similar News

News October 22, 2025

జనగామ జిల్లాలోని శివాలయాలు ఇవే

image

నేటి నుంచి కార్తీక మాసం ఆరంభం కావడంతో జనగామ జిల్లాలోని ప్రముఖ శివాలయాలు ఇవే.
* పాలకుర్తి సోమేశ్వరాలయం
* కొడవటూర్ సిద్ధేశ్వరాలయం
* చీటకోడూరు పంచకోసు రామలింగేశ్వరస్వామి
* జనగామ పట్టణంలోని శివాలయం
మీ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉంటే కామెంట్‌లో ఆలయం పేరు, లొకేషన్ తెలపండి.

News October 22, 2025

ఏడడుగులు ఎందుకంటే?

image

మొదటి అడుగు – శారీరక బలం కోసం
రెండో అడుగు – మానసిక బలం కోసం
మూడో అడుగు – ధర్మాచరణ కోసం
నాల్గో అడుగు – కర్మ సంబంధమైన సుఖం కోసం
ఐదో అడుగు – పశు సమృద్ధి కోసం
ఆరో అడుగు – రుతువులలో తగిన ఆరోగ్యం కోసం
ఏడో అడుగు – సంసార జీవితాన్ని ‘ఒక యజ్ఞంగా’ భావించమని చెప్పే ‘స్నేహం’ కోసం
<<-se>>#Pendli<<>>

News October 22, 2025

ఆదిలాబాద్‌: ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్య

image

చిన్న గొడవ కారణంగా ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు నెలరోజుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన సంతోశ్, గంగోత్రి సెప్టెంబర్ 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. దసరాకు అత్తింటికి వెళ్లారు. అక్కడ మటన్ కూర బాలేదని భార్యను సంతోశ్ మందలించడంతో మనస్తాపం చెంది పండుగ రోజే ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనోవేదనకు గురైన సంతోశ్ దీపావళి రోజు ఆదిలాబాద్‌లోని అక్క ఇంట్లో ఉరేసుకున్నాడు.