News March 23, 2024
పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్లే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ గెలిచినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండా ఎగిరింది. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి 2సార్లు MLAగా గెలిచారు. మిగతా అన్నిచోట్ల వైసీపీ ఒకసారే గెలిచింది. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. పాలకొల్లు, ఉండి స్థానాలనూ వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.
Similar News
News October 16, 2025
తణుకు: బీజేపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రేణుక

తణుకునకు చెందిన ముళ్లపూడి రేణుక బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి నుంచి జాతీయ మీడియా ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధిగా పాలకొల్లుకు చెందిన ఉన్నమట్ల కభర్దిలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఇరువురు నాయకులను అభినందించారు.
News October 15, 2025
పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News October 15, 2025
భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.