News March 25, 2025

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: కలెక్టర్

image

పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం సాయంత్రం మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతిగృహం, గూడూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ హై స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని అన్నారు. ఈకార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

తుని: 108 వాహనంలో మహిళ ప్రసవం

image

తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన మల్లి ఆశకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పాయకరావుపేట 108 సిబ్బంది ఆమెను తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కవ కావడంతో మెడికల్ టెక్నీషియన్ శ్రీనివాస్ చికిత్స అందించి అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

News September 17, 2025

ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

News September 17, 2025

స్త్రీల ఆరోగ్యమే కుటుంబ బలానికి ఆధారం: నవ్య

image

కర్నూలు పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, పోషణ్ మాహ్ కార్యక్రమాల్లో బుధవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.బి.నవ్య పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం పరిరక్షణతో కుటుంబ బలోపేతం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. సమతుల్య ఆహారం, యోగా, స్క్రీనింగ్ టెస్టులపై అవగాహన కల్పించారు. గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాశనం చేశారు.