News December 14, 2024

పట్టుదల ఉంటే ఉద్యోగం మీ సొంతం: మంత్రి పయ్యావుల

image

గ్రామీణ నిరుద్యోగ యువత, విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటే సులభతరంగా ఉద్యోగాలు పొందవచ్చని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా కృషి, పట్టుదలను అలవర్చుకోని ఉద్యోగ అన్వేషణలో ముందడుగు వేయాలని తెలిపారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని సంబంధం లేకుండా అనుభవాన్ని పెంచుకోవడానికి వచ్చిన ప్రతి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 16, 2025

అనంతపురంలో ‘డాకు మహారాజ్‌’ విజయోత్సవ వేడుక!

image

హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల 12న రిలీజైన ఈ మూవీ తొలిరోజే రూ.56కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ విజయోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఘటన కారణంగా అనంతలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News January 16, 2025

పెనుకొండ దారుణ ఘటన.. 22 మందిపై కేసు

image

ప్రేమికులు పారిపోవడానికి సహకరించిందన్న నెపంతో మహిళను వివస్త్రను <<15165737>>చేసి<<>> జుట్టు కత్తిరించిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు కియా పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

News January 16, 2025

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, జూదం ఆడుతున్న వారిపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.