News January 31, 2025
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు

బనగానపల్లెలోని కన్యకా పరమేశ్వరి వాసవి మాత ఆలయంలో శుక్రవారం జరిగిన ఆత్మార్పణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందించారు. కొండపేటలోని అమ్మవారి ఆలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందిరమ్మ దంపతులు అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.
Similar News
News November 27, 2025
అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం శారదానగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్య అమూల్య తన 3 ఏళ్ల కుమారుడు సహస్రను గొంతు కోసి, తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇరువురు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.
News November 27, 2025
సిరిసిల్ల: ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి’

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను శాంతియుత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయా ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


