News January 31, 2025

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు

image

బనగానపల్లెలోని కన్యకా పరమేశ్వరి వాసవి మాత ఆలయంలో శుక్రవారం జరిగిన ఆత్మార్పణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందించారు. కొండపేటలోని అమ్మవారి ఆలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందిరమ్మ దంపతులు అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.

Similar News

News December 5, 2025

హిమాచల్‌ప్రదేశ్ సీఎంని ఆహ్వానించిన మంత్రి అడ్లూరి

image

ఈనెల8,9 తేదీలలో జరగనున్న తెలంగాణ రెజ్లింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకిందర్ సింగ్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. శుక్రవారం మంత్రి స్వయంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి సీఎంని ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ఇరువురు ముచ్చటించుకున్నారు. సీఎం స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.

News December 5, 2025

ములుగు: నేర చరిత్రను దాచిన సర్పంచ్ అభ్యర్థి..!

image

సర్పంచ్ ఎన్నికలు వివాదాల వైపుకు దారి తీస్తున్నాయి. వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా పోటీలో ఉన్న ఓ వ్యక్తి తన నేరచరిత్రను దాచి పెట్టి ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడని ఆధారాలతో సహా మరో అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

News December 5, 2025

పాఠశాలలో భోజనం చేసిన అన్నమయ్య కలెక్టర్

image

కలెక్టర్ నిశాంత్ కుమార్ సిబ్యాలలోని ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో నిర్వహించిన మెగా PTMలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పిల్లలతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.