News May 24, 2024

పతాక స్థాయికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

NLG-KMM-WGL పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. 27న పోలింగ్ జరగనుండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతోపాటు స్థానిక నేతలతో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్రులు బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలపై ఎఫెక్ట్ పడనుంది.

Similar News

News November 11, 2025

NLG: పంట పండింది.. సేకరణ ఇలా

image

NLG జిల్లాలో ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు 5,26,796 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2,56,665 ఎకరాల్లో సాధారణ, 2,70,131ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. తద్వారా 13,44,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం 4,73,036 టన్నులు పోగా.. అమ్మకానికి 6,30,981 మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేస్తోంది.

News November 11, 2025

NLG: ధాన్యం సేకరణ నిబంధనల ఉల్లంఘన: ఇద్దరు అధికారులు సస్పెండ్‌!

image

ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించినందుకుగాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫీసర్‌ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి కె.సైదులును విధుల్లోంచి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు.

News November 11, 2025

NLG: ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్‌

image

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌లలో శాశ్వత చర్యలు చేపట్టాలి. స్కూల్‌ బస్సులకు సైడ్‌ మిర్రర్లు, సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.