News May 24, 2024

పతాక స్థాయికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

NLG-KMM-WGL పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. 27న పోలింగ్ జరగనుండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతోపాటు స్థానిక నేతలతో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్రులు బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలపై ఎఫెక్ట్ పడనుంది.

Similar News

News September 18, 2025

NLG: ఇంటర్ ఫలితాలు తిరోగమనం…!

image

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నల్గొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనిస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి పడిపోయింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు యంత్రాంగం దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News September 18, 2025

ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.

News September 18, 2025

ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

image

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.