News September 21, 2024
పత్తికొండలో క్వింటా టమాటా రూ.3,200

రాష్ట్రంలో మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమాటా మార్కెట్ అతిపెద్దది. జిల్లాలోని తుగ్గలి, మద్దికేర, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల నుంచి పత్తికొండ మార్కెట్కు రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకొస్తారు. వారం రోజులుగా ఈ మార్కెట్లో ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో గరిష్ఠంగా రూ.30పైనే పలుకుతున్నాయి. నిన్న క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.3,200 పలికింది.
Similar News
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.


