News February 2, 2025

పత్తికొండ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పత్తికొండ పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ఆయన వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబు, ట్రైనీ కలెక్టర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

ప్రతి పాఠశాలలో వారం రోజులు వేడుకలు: డీఈవో

image

కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు.19న ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ హైస్కూల్‌లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.5 వేల వరకు బహుమతులు అందజేస్తారు.

News December 17, 2025

‘జిల్లాలో రబీకి యూరియా కొరత లేదు’

image

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు మొత్తం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 8,487 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉండగా, డిసెంబర్ చివరికి మరింత యూరియా రానుందని చెప్పారు. రైతులు ఎంఆర్పీ ధరలకే ఎరువులు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.

News December 17, 2025

ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

image

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్‌లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.