News February 2, 2025

పత్తికొండ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పత్తికొండ పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ఆయన వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబు, ట్రైనీ కలెక్టర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

రీ-ఓపెన్ అర్జీదారులతో కలెక్టర్ సంభాషణ

image

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన రీ-ఓపెన్ అర్జీలపై కర్నూలు కలెక్టర్ డా. ఎ. సిరి సోమవారం స్వయంగా అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అర్జీల పరిశీలన, ఎండార్స్‌మెంట్ల అందజేత, భూమి సంబంధించిన అంశాలలో ఫీల్డ్ విజిట్ జరిగిందా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News November 17, 2025

రీ-ఓపెన్ అర్జీదారులతో కలెక్టర్ సంభాషణ

image

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన రీ-ఓపెన్ అర్జీలపై కర్నూలు కలెక్టర్ డా. ఎ. సిరి సోమవారం స్వయంగా అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అర్జీల పరిశీలన, ఎండార్స్‌మెంట్ల అందజేత, భూమి సంబంధించిన అంశాలలో ఫీల్డ్ విజిట్ జరిగిందా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

News November 17, 2025

విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రీన్ స్టోరేజ్ కీలకం: కేంద్రమంత్రి

image

కర్నూలు జిల్లా పాగిడియాల మండలంలో గ్రీన్‌కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పవర్ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులకు ప్రాజెక్టు పురోగతిపై ఆయన అవగాహన కల్పించారు. అవసరమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.