News February 2, 2025
పత్తికొండ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

పత్తికొండ పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ఆయన వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబు, ట్రైనీ కలెక్టర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 16, 2025
రీ సర్వే విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

గోనెగండ్లలో జరుగుతున్న రీసర్వే పనులనుకలెక్టర్ రంజిత్ భాష శనివారం పరిశీలించారు. అధికారులు చేపడుతున్న రీసర్వే విధానాన్ని, తహశీల్దార్ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అపోహలు లేకుండా రీసర్వే కొనసాగించాలన్నారు. రైతులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.
News February 16, 2025
కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలులోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది, ఇంటర్, డిగ్రీ, కోర్సుల్లో అర్హత సాధించిన వారు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 15, 2025
కర్నూలులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందిన వివరాల మేరకు.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న రమ్యతేజ అనే విద్యార్థిని హాస్టల్లో పురుగు మందు తాగారు. గమనించిన సిబ్బంది వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రమ్యతేజ అనంతపురానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.