News December 23, 2024
పత్తికొండ గ్రామ చరిత్ర తెలుసా?
పత్తికొండలో పూర్వం ఒక గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు మేపుతూ.. క్రమంగా అడవిని నరికి పత్తి పండించాడని రాజుల చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పంటలు బాగా పండటంతో ఇతరులు వచ్చి పంటలు పండిస్తూ ఉండిపోయారట. ఇలా గ్రామంగా ఏర్పడిన తర్వాత విజయనగర యువ రాజు వేంకటరాజా ఈ గ్రామాన్ని సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించాడని చరిత్ర. అందువల్ల ఈ గ్రామానికి పత్తికొండ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు.
Similar News
News January 22, 2025
వచ్చే నెల 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
News January 22, 2025
కర్నూలు: ముగ్గురు విద్యార్థుల మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. విద్యార్థులు హంపిలో ఆరాధనకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
News January 22, 2025
మంత్రాలయం విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్తో పాటు ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులు మృతి చెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.