News February 13, 2026
పత్తి తీత తర్వాత తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు

పత్తి తీత తర్వాత ఆ చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తి మోళ్లను అందుబాటులో ఉండే ట్రాక్టరు రోటవేటరుతో భూమిలో కలియదున్నాలి. ఎండిన మొక్కల మోళ్లు, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నడం వల్ల పంటకు హాని చేసే పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పత్తి పంట పూర్తయిన తర్వాత ఆ భూమిలో నీటి వసతి ఉంటే రెండో పంటగా ఇతర ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు.
Similar News
News March 14, 2026
సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేస్తాం: కేంద్రం

నేషనల్ సెక్యూరిటీ యాక్ట్(NSA) కింద 6 నెలలుగా జైలులో ఉన్న పర్యావరణవేత్త <<17827658>>సోనమ్ వాంగ్చుక్<<>>ను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ‘లద్దాక్లో శాంతి, స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నాం. అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలకు సిద్ధం. ఇందులో భాగంగా సోనమ్ శిక్షను రద్దు చేస్తున్నాం’ అని పేర్కొంది. లద్దాక్లో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో గతేడాది SEP 26న సోనమ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
News March 14, 2026
IPLలో ఆడనున్న ముజరబాని.. పాక్ బోర్డు లీగల్ యాక్షన్!

PSL కాంట్రాక్ట్ను <<19375126>>వదులుకొని<<>> IPLలో KKR తరఫున ఆడటానికి సిద్ధమైన ముజరబాని(ZIM)పై లీగల్ యాక్షన్కు పాక్ క్రికెట్ బోర్టు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో ఇస్లామాబాద్ టీమ్ నుంచి తప్పుకోవడాన్ని సవాల్ చేయనున్నట్లు సమాచారం. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బోష్ తొలుత పెషావర్ జల్మీ డైమండ్ జట్టులో చేరి తర్వాత MI టీమ్కు షిఫ్ట్ అయ్యారు. కాగా PSL మార్చి 26 నుంచి మే 3 వరకు జరగనుంది.
News March 14, 2026
హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

భారత్కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.


