News March 5, 2025
పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: నంద్యాల కలెక్టర్

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వైద్యాధికారులు, మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్లో జనన మరణ పత్రాల జారీపై ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
Similar News
News November 3, 2025
వరంగల్: వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే చర్యలు!

కారులో ప్రయాణించే వారిని గుర్తించేందుకు వీలు లేకుండా కార్ గ్లాస్లకు బ్లాక్ ఫిల్మ్ అతికించడం నేరమని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫిల్మ్ను తొలగించడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు గాను రూ.500 నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.
News November 3, 2025
ADB: మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజార్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరు దుకాణాల కేటాయింపులు ఈ కార్యక్రమంలో పూర్తయ్యాయి. ఎక్సైజ్ పాలసీ–2025–27 ప్రకారం షాపులకు టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. ప్రక్రియ మొత్తం ఫోటో, వీడియో రికార్డింగ్తో పూర్తి పారదర్శకంగా సాగింది.
News November 3, 2025
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం కానీ, వినియోగించడం కానీ జరగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి సాగు పై వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


